మాస్క్‌‌ల కోసం టెండర్లకు ఆహ్వానం

by  |

దిశ, న్యూస్ బ్యూరో: కొవిడ్ – 19 నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన మాస్క్‌ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం వద్ద నమోదైన సరఫరాదారులు మాత్రమే తమ టెండర్లు సమర్పించాలని అందులో కోరింది. ఒక్కో ఏజెన్సీ రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల మధ్య తమ కొటేషన్ వేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 వరకే లాక్‌డౌన్ ప్రకటించినా.. ఏప్రిల్ 14 వరకూ కొనసాగిస్తుండటంతో ఆ మేరకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags: Mask, Tender, State Govt, Govt registered tenderer


Next Story