కరోనాతో చనిపోతే రూ. 4 లక్షలు ?

by  |
కరోనాతో చనిపోతే రూ. 4 లక్షలు ?
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కాటుకు ఎంతో మంది బలయ్యారు. సంపాదించి ఇంటికి అండగా ఉండే ఇంటి పెద్దను ఎన్నో కుటుంబాలు కోల్పోయాయి. అయితే ఇలా కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. కరోనాను కేంద్రం ప్రకృత్తి విపత్తుగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రకృత్తి విపత్తుల కారణంగా ఏ వ్యక్తి అయినా మరణిస్తే వారికి ప్రభుత్వ రూ.4 లక్షలు పరిహారం కింద చెల్లించాలని జీవోలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రకృతి విపత్తుల్లో కరోనా కూడా ఉదని అందువలన కరోనాతో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం 4 లక్షల రూపాయిలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే ఎక్స్ గ్రేషియా ఇవ్వడం పై తమకు కొంత సమయం కావాలని కోర్టును కేంద్రం కోరింది.


Next Story

Most Viewed