శిరోముండనం బాధితుడికి ప్రభుత్వం కీలక హామీ 

by  |
శిరోముండనం బాధితుడికి ప్రభుత్వం కీలక హామీ 
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల నూతన నాయుడు ఇంట్లో కుటుంబసభ్యులు, వారి సిబ్బంది చేత దళిత యువకుడు శ్రీకాంత్ అమానుషంగా దాడి కాబడి, శిరోముండనానికి గురయ్యాడు.ఆదివారం అతనిని మంత్రి అవంతి శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. శ్రీకాంత్ కు మనోధైర్యం చెప్పారు.

ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించడంతో పాటు 50 వేల రూపాయలు ఆర్థిక సహయాన్ని అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున నివాసస్థలం, ఔట్ సోర్సింగ్ జాబ్ ను ఇవ్వనున్నట్టు కీలక హామీని ప్రకటించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. తప్పు చేసినవారు ఎలాంటివారైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.


Next Story