నేడు మధ్యాహ్నం మర్రిగూడకు గవర్నర్ తమిళసై రాక

by  |
నేడు మధ్యాహ్నం మర్రిగూడకు గవర్నర్ తమిళసై రాక
X

దిశ, మర్రిగూడ: మర్రిగూడ మండల కేంద్రానికి ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్ తమిళ సై రానున్నారు. మండల కేంద్రంలోని గ్రామభారతి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణాలకు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ శంకుస్థాపన చేయనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

గ్రామభారతిలో 20 ఎకరాల స్థలం ఉండగా అదనంగా ఐదు ఎకరాలు లీజుకు తీసుకుని నిర్వాహకులు గ్రామభారతిని నిర్వహిస్తున్నారు. దీని ఆధ్వర్యంలో ప్రస్తుతం అనాథ విద్యార్థులకు హాస్టల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. గవర్నర్ తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ లు శంకుస్థాపనకు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Next Story

Most Viewed