వెంకటేశ్వర స్వామి రజతోత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై

by  |
వెంకటేశ్వర స్వామి రజతోత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
X

దిశ, శేరిలింగంపల్లి : చందానగర్ శ్రీ శారదా పీఠ పాలిత వెంకటేశ్వర స్వామి రజతోత్సవాల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. స్వామి వారిని సందర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం సాత్మనందేంద్ర స్వామి ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం స్వామి స్వరూపానందేంద్ర ఆశీర్వచనాలు పొందారు. అలాగే వెంకటేశ్వర స్వామివారి ఆభరణాలను సందర్శించారు.

Next Story