దానికి అనుగుణంగా సిలబస్ మారాలి : గవర్నర్ తమిళిసై

by  |
Governor Tamilisai
X

దిశ, వెబ్‌డెస్క్: అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకంగా ఉపయోగపడుతాయని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ‘జాతీయ విద్యావిధానం-కామర్స్ బిజినెస్ ఎడ్యుకేషన్ దృక్పదాలు’ అన్న అంశంపై నిర్వహించిన నేషనల్ వెబినార్ సదస్సులో గవర్నర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను యూనివర్సీటీలు ప్రోత్సాహించాలని ఆమె సూచించారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. దేశంలో ఈ-కామర్స్ బిజినెస్ వేగంగా విస్తరిస్తోందని, ఈ-కామర్స్ విద్యపై కూడా యూనివర్సీటీలు దృష్టి సారించాలని వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలని అన్నారు. హైదరాబాద్ ఐటీ, ఫార్మా హబ్‌గా వేగంగా ఎదుగుతోందని తెలిపారు. ఈ-కామర్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్ రంగాల్లో కూడా హబ్‌గా ఎదగాలని అభిప్రాయపడ్డారు.

Next Story

Most Viewed