- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకంగా ఉపయోగపడుతాయని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ‘జాతీయ విద్యావిధానం-కామర్స్ బిజినెస్ ఎడ్యుకేషన్ దృక్పదాలు’ అన్న అంశంపై నిర్వహించిన నేషనల్ వెబినార్ సదస్సులో గవర్నర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను యూనివర్సీటీలు ప్రోత్సాహించాలని ఆమె సూచించారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. దేశంలో ఈ-కామర్స్ బిజినెస్ వేగంగా విస్తరిస్తోందని, ఈ-కామర్స్ విద్యపై కూడా యూనివర్సీటీలు దృష్టి సారించాలని వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయాలని అన్నారు. హైదరాబాద్ ఐటీ, ఫార్మా హబ్గా వేగంగా ఎదుగుతోందని తెలిపారు. ఈ-కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ రంగాల్లో కూడా హబ్గా ఎదగాలని అభిప్రాయపడ్డారు.