రాజ్‌భవన్‌లో సీజేఐ దంపతులకు గవర్నర్ విందు..

by  |
tamilisai
X

దిశ, వెబ్‌డెస్క్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఎన్వీ రమణ దంపతులను తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. సీజేఐ అయ్యాక ఎన్వీ రమణ తొలిసారి తెలంగాణకు వచ్చిన సందర్భంగా గవర్నర్ తమిళిసై విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమంలో ఎన్వీ రమణ దంపతులు, హైకోర్టు సీజే హిమా కోహ్లీ, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. విందు అనంతరం ఎన్వీ రమణ దంపతులు ఈరోజు రాత్రి రాజ్ భవన్‌లోనే బస చేయనున్నారు.

Next Story

Most Viewed