- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్బ్యూరో: సహనశీలమైన, సుందర సమాజ నిర్మాణమే మాజీ రాష్ట్రపతి ఏపీజే కలాంకు మనమిచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కలాం ఐదో వర్థంతి సందర్భంగా సోమవారం ఏపీజే కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్ రాజ్భవన్ నుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కలాం దృష్టిలో ఎక్కడైతే ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారో, ఇతరుల ఆచార, వ్యవహారాలను, సంస్కృతిని, వేషభాషలను గౌరవిస్తారో అదే సుందరమైన సమాజమని వివరించారు. శ్రమను, కృషిని ఎంతో గౌరవించేవారని, కష్టించి పని చేయడాన్ని ఎంతగానో అభిమానించేవారని ఓ సంఘటనను వివరించారు. భారత రాష్ట్రపతిగా, మిస్సైల్ సైంటిస్ట్గా, ఆవిష్కర్తగా, రచయితగా కాకుండా తనను ఒక టీచర్గా గుర్తుంచుకోవాలని కలాం చెప్పేవారని తెలిపారు. ఆయన రెండోసారి రాష్ట్రపతి కాకపోవడం భారత దేశానికి, ఈ దేశ యువతకు తీరని అన్యాయమని గవర్నర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు నజీమా మరైకర్, ఏపీఎంజె షేక్ దావూద్, ఎపిఎంజె షేక్ సలీమ్, పద్మశ్రీ కార్తికేయ పాల్గొన్నారు.