అమరచింతలో డెంగ్యూ విస్తరణపై గవర్నర్ ఆరా

by  |
అమరచింతలో డెంగ్యూ విస్తరణపై గవర్నర్ ఆరా
X

ప్రపంచం కరోనాతో విలవిలలాడుతుంటే వనపర్తి జిల్లాలో మాత్రం డెంగ్యూ విజృంభిస్తోంది. అమరచింత మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 38 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. ఈ వ్యవహారంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. జిల్లాలో డెంగ్యూ కేసుల పెరుగుదల సంబంధించి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పరిధిలో డెంగ్యూ నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను గవర్నర్ ఆదేశించారు.

Tags: Dengue, amarachitha, governor, vanparthi distric

Next Story

Most Viewed