ప్రజలకు వాస్తవాలే చెబుతున్నాం : శ్రీకాంత్ రెడ్డి

by  |
ప్రజలకు వాస్తవాలే చెబుతున్నాం : శ్రీకాంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ తన స్థాయికి దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం, గూండాల ప్రభుత్వం అంటూ ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నమే వైసీపీ చేస్తోందని, అంతేగానీ ఎవరినీ టార్గెట్ చేసే ఉద్దేశం తమకు లేదని అన్నారు.

Next Story

Most Viewed