మాజీ జెడ్పీటీసీ భర్త.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

by  |
Government-Teacher-Dies
X

దిశ, ములుగు: గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మల్లయ్య పల్లె గ్రామానికి చెందిన బానోతు సమ్మయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో అతడిని హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సమ్మయ్య మృతిచెందాడు. సమ్మయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో ఆయన భార్య వెంకటాపూర్ మండలానికి జెడ్పీటీసీగా పని చేసింది.


Next Story