భయబ్రాంతులకు గురిచేస్తున్నారు : ఎమ్మెల్యే సీతక్క

by  |
భయబ్రాంతులకు గురిచేస్తున్నారు : ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, వరంగల్: ఏజెన్సీ ప్రాంతాల్లో 30 ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిన భూముల్లో కూడా ఈ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములు గుంజుకుంటోందని మండిపడ్డారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం రైతులకు పట్టాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం ఆమె ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారులు తక్షణమే దాడులు నిలిపివేయాలన్నారు. గత అసెంబ్లీలో ముఖ్యమంత్రి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం రైతులకు పట్టాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed