కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. నెక్ట్స్ ‘టార్గెట్’ ప్రభుత్వ భూములే..?

by  |
Kcr-Web
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. కరోనా కారణంగా ప్రజా జీవనం స్తంభించిపోయింది. ఉపాధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం భారీగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిధుల సేకరణకు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ప్రభుత్వ భూముల అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఏ భూములు అమ్మకానికి పెట్టాలనే డేటా సేకరణలో అధికారులు నిమగ్నమైనట్టు తెలుస్తోంది. వివిధ జాబితాల్లోని ఏ భూములు అమ్మాకానికి పెట్టాలన్న దానిపై మంగళవారం జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. భూముల అమ్మకం ద్వారా వేల కోట్లు ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.



Next Story

Most Viewed