తేడాలు వస్తే మీదే బాధ్యత..! కలెక్టర్లకు సర్కార్ ఆదేశం

by  |
corona
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా మృతులను గుర్తించే విషయంలో తేడాలు వస్తే మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్ని జిల్లాల కలెక్టర్లను సర్కార్ ​ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రాహుల్​ బొజ్జ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేగంగా కరోనా మృతులను గుర్తించి 50 వేల నష్ట పరిహారాన్ని అందించాలన్నారు. కరోనాతో మృతి చెందిన బాధితులు వెంటనే అప్లై చేసుకోవాలన్నారు. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో దరఖాస్తులను స్వీకరించాలన్నారు. ఆన్​లైన్​ లో అప్లై చేసుకున్న వారి వివరాలను పరిశీలించి కలెక్టర్​ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ప్రత్యేక కొవిడ్​ డెత్​ సర్టిఫికేట్​ ను ఇస్తుందన్నారు.దాన్ని జతచేస్తూ మీ సేవాలో పూర్తి అకౌంట్​ వివరాలతో మరోసారి దరఖాస్తు చేసుకోవాలన్నారు. 30 రోజుల్లో డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు.



Next Story