ఎంఎస్ఎంఈల డిజిటలైజేషన్

by  |
ఎంఎస్ఎంఈల డిజిటలైజేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను డిజిటల్ స్కిల్లింగ్, టెక్నాలజీతో సన్నద్ధం చేసి, సాధికారత కల్పించేందుకు సాప్ ఇండియా అనే సంస్థతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ మార్కెట్‌‌ను అందుకోవడానికి, శ్రామికశక్తికి డిజిటల్ స్కిల్లింగ్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీని కల్పించేందుకు ఈ ప్రక్రియ తోడ్పాటు అందించనుంది. పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేష్​‌రంజన్​ మాట్లాడుతూ స్థానిక ఎంఎస్ఎంఈల ప్రయోజనం, మార్కెట్, స్కిల్లింగ్, ఇతర సమస్య పరిష్కారాలను అందించేందుకు ఎస్ఏపీ గ్లోబల్​ టెక్నాలజీ ప్లేయర్ సహకరిస్తుందన్నారు. పరిశ్రమ, ప్రభుత్వ భాగస్వామ్యం బలపడేందుకు దోహదపడుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల మధ్య పారిశ్రామిక వృద్ధిపై నిరంతర దృష్టితో, ప్రభుత్వం స్థిరమైన ఆర్థికాభివృద్ధికి, సమగ్ర సామాజిక అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.


Next Story

Most Viewed