తెలుగు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

by  |
తెలుగు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 72వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ హైదరాబాద్‌ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

అదే విధంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ విజయవాడలోని మైదానంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించనున్నారు. ఇదిలాఉండగా, పబ్లిక్ గార్డెన్‌లో జరిగే వేడుకలకు సీఎం కేసీఆర్, విజయవాడలో జరిగే సెలబ్రేషన్స్‌కు ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు.



Next Story