ఆయన త్వరగా కోలుకుని దేశానికి సేవ చేయాలని ప్రార్థిస్తున్నా : గవర్నర్ తమిళి సై

by  |
ఆయన త్వరగా కోలుకుని దేశానికి సేవ చేయాలని ప్రార్థిస్తున్నా : గవర్నర్ తమిళి సై
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ బుధవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారని తమిళి సై తెలిపారు. ప్రస్తుతం ఏపీ గవర్నర్‌కు ఏఐజీలో మంచి వైద్యం అందుతోందన్నారు. ఆయన త్వరగా కోలుకుని దేశానికి సేవ చేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని తమిళి సై వెల్లడించారు.



Next Story

Most Viewed