గిరిజనుల సమక్షంలో గవర్నర్‌కు వ్యాక్సినేషన్

by  |
గిరిజనుల సమక్షంలో గవర్నర్‌కు వ్యాక్సినేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గిరిజనులతో కలిసి సోమవారం వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించేందుకు, వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని ఆమె ఈ ప్రకటన ద్వారా తెలిపారు. మొదటి టీకా డోస్‌ను పుదుచ్చేరి ప్రభుత్వ ఆస్పత్రిలో తీసుకున్న ఆమె రెండవ టీకా డోసును సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కేసి తండాలో గిరిజనులతో కలిసి తీసుకోనున్నారు.

వ్యాక్సినేషన్ పై అపోహలను తొలగించడం ద్వారా గిరిజనుల్లో 100 శాతం వ్యాక్సినేషన్ సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా అధికార యంత్రాంగం సమాయత్తమవ్వాలని సూచించారు. మారూమూల ప్రాంతాల్లోని ఆదివాసీ, గిరిజనులందరికీ కూడా ప్రాధాన్యం ఇచ్చి వ్యాక్సిన్ ఇవ్వాలని గవర్నర్ వైద్య అధికారులను ఆదేశించారు.


Next Story

Most Viewed