అబ్కారీ మంత్రికి గౌడ సంఘాల వినతి

by  |
అబ్కారీ మంత్రికి గౌడ సంఘాల వినతి
X

దిశ, న్యూస్‌బ్యూరో :
రాష్ట్రంలోని కల్లు దుకాణాల్లో పార్శిల్ కల్లును అనుమతించాలని కోరుతూ తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అబ్కారీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌కు శనివారం వినతిపత్రమిచ్చారు. లాక్‌డౌన్ రోజుల్లో గీత కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని అందులో పేర్కొన్నారు. వైన్స్ దుకాణాలకు అనుమతిచ్చినా.. కల్లు దుకాణాలకు ఇవ్వలేదని, గౌడ వృత్తిదారులకు కూడా అనుమతినిచ్చి ఆదుకోవాలని కోరారు. వినతిపత్రమిచ్చిన వారిలో కమిటీ రాష్ట్ర చైర్మన్ బాలగౌని బాల్‌రాజు గౌడ్, కన్వీనర్ అయిలి వెంకన్న, విజయ్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed