శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..

by  |
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. రేపటి నుంచి అనగా (డిసెంబర్- 11)వ తేది నుంచి శ్రీనివాస మంగాపురంలో లడ్డూల విక్రయం చేయనున్నట్టు ప్రకటించింది. మొదటి రోజు ప్రయోగాత్మకంగా 3వేల లడ్డూలు విక్రయిస్తామని తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే తరచూ లడ్డూల విక్రయాలు కొనసాగుతాయని ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం భక్తులు టీటీడీ అధికారిక వైబ్ సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.


Next Story