- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్థానికతతో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త. తెలంగాణకు చెందిన 711 మంది ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు క్లాస్-3, క్లాస్-4 స్థాయిలోని ఉద్యోగులను రిలీవ్ చేస్తున్నట్టు ఏపీ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.
రాష్ట్ర విభజన నుంచి సాగుతున్న ఈ వివాదం ఎట్టకేలకు తెర పడింది. ఇటీవల సీఎం కేసీఆర్తో భేటీ అయిన ఉద్యోగ సంఘాలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో కూడా సీఎం ప్రకటించారు. అనుకున్న విధంగానే ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపారు. దీంతో ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Next Story