తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్

by  |
తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్థానికతతో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త. తెలంగాణకు చెందిన 711 మంది ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు క్లాస్-3, క్లాస్-4 స్థాయిలోని ఉద్యోగులను రిలీవ్ చేస్తున్నట్టు ఏపీ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.

రాష్ట్ర విభజన నుంచి సాగుతున్న ఈ వివాదం ఎట్టకేలకు తెర పడింది. ఇటీవల సీఎం కేసీఆర్​తో భేటీ అయిన ఉద్యోగ సంఘాలకు సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో కూడా సీఎం ప్రకటించారు. అనుకున్న విధంగానే ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపారు. దీంతో ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్​ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed