ఎన్టీఆర్ స్టేడియంలో గోల్కొండ క్రాప్ట్ బజార్ ప్రారంభం

by  |
ఎన్టీఆర్ స్టేడియంలో గోల్కొండ క్రాప్ట్ బజార్ ప్రారంభం
X

దిశ, హైదరాబాద్: ఇందిరాపార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్‌ కుమార్ చేతుల మీదుగా గోల్కొండ క్రాఫ్ట్ బజార్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. కొత్త కళాకారులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఈ ప్రదర్శన ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో లక్షమంది హస్త కళాకారులకు చేయూతనందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. గోల్కొండ క్రాఫ్ట్ బజార్ మేనేజర్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ.. ఈ ప్రదర్శనలో 150 స్టాల్స్‌ను ప్రదర్శనకు ఉంచినట్టు తెలిపారు. కార్యక్రమంలో నేషనల్ జ్యూట్ బోర్డు అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహులు, హస్తకళల అభివృద్ధి సంస్థ కన్సల్టెంట్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed