ఆర్టీసీ బస్సులో మహిళ బంగారం మాయం

by  |
business news
X

దిశ, శంషాబాద్: బస్సులో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగ్, గోల్డ్ చైన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన ఆర్జీఐఏ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన సరస్వతి అనే మహిళ హైదరాబాద్ వెళ్ళేందుకు షాద్‌నగర్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కింది. అయితే, తన బ్యాగులో మూడు తులాల గోల్డ్ చైన్ పెట్టుకొని ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో పాలమాకుల వద్దకు రాగానే అమె బ్యాగులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏదో తీసేందుకు ప్రయత్నించినట్లు అనిపించడంతో వెంటనే బ్యాగులో వెతకగా గోల్డ్‌చైన్ కనిపించలేదు. దీంతో ఆమె డ్రైవర్, కండక్టర్‌తో చెప్పడంతో వారు ఆర్జీఐఏ పోలీస్టేషన్ ఎదుట బస్సును ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బస్సులోని ప్రయాణికుల వద్ద తనిఖీ చేశారు. కానీ, గోల్డ్‌చైన్ మాత్రం కనిపించలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed