ఓ వృద్ధురాలి ఇంట్లో చోరీ..!

by  |
ఓ వృద్ధురాలి ఇంట్లో చోరీ..!
X

దిశ, కంటోన్మెంట్ : ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలి ఇంట్లో భారీ చోరి జరిగిన ఘటన బోయిన్‎పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

డిటెక్టివ్ ఇన్‎స్పెక్టర్ అక్రమ్ బాబా కథనం ప్రకారం.. న్యూ బోయిన్‎పల్లి నూతన్ కాలనీకి చెందిన విజయలక్ష్మీకి ముగ్గురు పిల్లలు. ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉండగా.. ఓ కుమార్తె మల్కాజిగిరిలో ఉంటోంది. దీంతో విజయలక్ష్మీ సాయిదర్శన్ అపార్ట్‎మెంట్‎లో ఒక్కరే ఉంటున్నారు. బుధవారం విజయలక్ష్మీ తన బంగారు అభరణాలను సరిచూసుకునేందకు అల్మారా నుంచి బయటకు తీయగా.. అదే సమయంలో వేరే వ్యక్తులు రావడంతో పర్సును ఫ్రీజ్‎పై పెట్టింది. అనంతరం పర్సును లోపల పెట్టాలని భావించి ఫ్రీజ్‎పై చూడగా అభరణాలు కనిపించలేదు. విజయలక్ష్మీ ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న బేగంపేట ఏసీపీ నరేష్ రెడ్డి, బోయిన్‎పల్లి ఇన్‎స్పెక్టర్ రవికుమార్.. ఆ రోజు ఇంట్లోకి ఎవరెవరు వచ్చారో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



Next Story

Most Viewed