స్మగ్లర్ తెలివికి సలాం..పేస్టు రూపంలో బంగారాన్ని మార్చి..

by  |
స్మగ్లర్ తెలివికి సలాం..పేస్టు రూపంలో బంగారాన్ని మార్చి..
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలోనూ దేశంలో గోల్డ్ స్మగ్లింగ్ భారీగా సాగుతోంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు కొత్త కొత్త పద్ధతుల్లో బంగారాన్ని గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేస్తూ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా చెన్నై ఎయిర్‌పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 1కేజీన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

బంగారాన్ని పేస్టు రూపంలో మార్చి పాదాల కింద దాచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే అతన్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed