శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గోల్డ్ సీజ్

by  |
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గోల్డ్ సీజ్
X

దిశ రాజేంద్రనగర్ : అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తి కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. శుక్రవారం దుబాయ్ నుండి ఇండిగో (6E-025) విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తి కదలికలపై అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని తనిఖీ చేశారు. జీన్ పాయింట్‌లో ఏదో పౌడర్‌ ఉందని గ్రహించిన అధికారులు.. పాయింట్ తీసి మొత్తం చెక్ చేశారు. దీంతో పాయింట్ లోపలి బాగానా ప్రత్యేకంగా కుట్టించిన జేబులో ఓ కవర్ దొరికింది. కవర్ తెరిచి చూడగా.. అందులో బంగారు పౌడర్ లభ్యమైందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బంగారాన్ని సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం 395.07 గ్రాములు ఉండగా.. దానికి విలువ రూ. 19 లక్షల 98 వరకు ఉంటుందని కస్టమ్ అధికారులు తెలిపారు.


Next Story