శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

by Shyam |

<p>దిశ, రాజేంద్రనగర్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారు బిస్కెట్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ మస్తాన్ అనే వ్యక్తి సోమవారం కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. విమానాశ్రయంలో అతడి ప్రవర్తనలో మార్పు కనిపించడంతో  కస్టమ్స్, ఎయిర్ పోర్ట్ ఇంటలిజెన్స్ అధికారులు అతన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని వద్ద 160 గ్రాముల బంగారు బిస్కెట్లు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదుచేసి నిందితుడిని [&hellip;]</p>

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం
X

దిశ, రాజేంద్రనగర్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారు బిస్కెట్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ మస్తాన్ అనే వ్యక్తి సోమవారం కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. విమానాశ్రయంలో అతడి ప్రవర్తనలో మార్పు కనిపించడంతో కస్టమ్స్, ఎయిర్ పోర్ట్ ఇంటలిజెన్స్ అధికారులు అతన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని వద్ద 160 గ్రాముల బంగారు బిస్కెట్లు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదుచేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story