రంగారెడ్డిలో మరోసారి భారీగా బంగారం పట్టివేత..

by  |
రంగారెడ్డిలో మరోసారి భారీగా బంగారం పట్టివేత..
X

దిశ, రాజేంద్రనగర్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. రెండు రోజుల వ్యవధిలోనే కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుండి G9-458 విమానంలో హైదరాబాద్ బయలుదేరిన మహమ్మద్ రఫిక్ బంగారాన్నిపేస్ట్ రూపంలో తన లో దుస్తుల్లో పెట్టుకుని శంషాబాద్ విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. అతని పై కస్టమ్స్ అధికారులకు అనుమానం రాగా ఆపి తనిఖీలు చేశారు. అతని నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 43,55,147/ లక్షల వరకు ఉంటుందని అంచనా.

Next Story

Most Viewed