- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రాజేంద్రనగర్ : రాజీవ్ గాంధీ విమానాశ్రయంలోని ఓ విమానంలో సీటు కింద దాచిపెట్టిన 794 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన విమానం దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకుంది. అదే సమయంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది.
దీంతో వారు ముమ్మర తనిఖీలు చేపట్టగా ఓ ప్రయాణికుడు విమానంలోని సీటు కింద రూ. 39 లక్షల విలువైన 794 గ్రాముల బంగారాన్ని వదిలి వెళ్లిపోయాడు. తనిఖీల్లో భాగంగా విమానం సీటు కింద బంగారం కనిపించడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆ బంగారాన్ని ఎవరు తీసుకొచ్చారనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story