ధర్మపురిలో గోదావరి హారతి ప్రారంభం

by  |
Godhavari-21
X

దిశ, ధర్మపురి: పుణ్యక్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం గోదావరి హారతి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా 15 రోజులపాటు సాయంత్రం లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు దేవాలయం నుంచి బాజా బజంత్రీలతో గోదావరికి వెళ్లి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి మాతకు హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈఓ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed