రామలింగారెడ్డి ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యం

by  |
రామలింగారెడ్డి ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యం
X

దిశ, దుబ్బాక : దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆశయాలు కొనసాగించాలని ఆయన సతీమణి సుజాతకు టీఆర్ఎస్ టిక్కెట్ ఖరారు చేసినట్లు మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాతను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో.. మంగళవారం చిట్టాపూర్ గ్రామంలో ఆమెను మంత్రి హరీష్ రావు కలిసి ఎన్నికల వ్యూహంపై చర్చించారు. హరీష్ రావు వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, పద్మ దేవేందర్ రెడ్డి లు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సోలిపేట రామలింగారెడ్డి అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. రామలింగారెడ్డి మరణం చాలా బాధాకరం అని.. ఆయన ఆశయాలను కొనసాగించాలని వారి కుటుంబానికి టిక్కెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‎కు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో తన కోసం ఇంటింటా ప్రచారం చేసిన వ్యక్తి సోలిపేట సుజాత అన్నారు. సుజాత తనకు చెల్లిలాంటిదని.. తనను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.



Next Story