మోసం చేసి కూడా ప్రియురాలిని వదలని ప్రియుడు.. చెట్టుకు ఊరేసుకుని..!

by  |
మోసం చేసి కూడా ప్రియురాలిని వదలని ప్రియుడు.. చెట్టుకు ఊరేసుకుని..!
X

దిశ, కామారెడ్డి: ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. యువతిని లోబరుచుకున్నాడు.. తీరా అతనికి పెళ్ళై ఒక కూతురు కూడా ఉందని తెలిసినా కూడా ఆ యువతి భరించుకుంది. కానీ, వేరే వ్యక్తితో పెండ్లి ఫిక్స్ చేసుకుందని తెలుసుకున్న ప్రియుడు మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. అతడి వేధింపులు రోజు రోజుకి పెరగడంతో భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మాచారెడ్డి మండలం ఫరీద్ పేట గ్రామంలో చోటుచేసుకుంది.

బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మదిరే కవిత(19)ను అదే గ్రామానికి చెందిన గోజురి ప్రవీణ్ ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో కవితను లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్‌కు ఇంతకుముందే ఓ అమ్మాయితో వివాహమై కూతురు కూడా ఉందని తెలిసింది. దాంతో ఇరు కుటుంబాల్లో విషయం తెలిసి పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. తర్వాత కవితకు ఇతర వ్యక్తితో వివాహం నిశ్చయించారు.

అయితే కవిత నిశ్చితార్థం జరిగిన రోజు నుంచి తరచూ ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడు ప్రవీణ్. దాంతో మనస్తాపానికి గురైన కవిత గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కవిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story