బాలికపై ఆరు నెలలుగా అత్యాచారం

by  |
బాలికపై ఆరు నెలలుగా అత్యాచారం
X

దిశ, నాగార్జున సాగర్:
నిర్భయ చట్టాలు తెచ్చి కఠినమైన శిక్షలు వేస్తున్నా ఆడవారిపై ఆఘాయిత్యాలు ఆగడంలేదు. అభం శుభం తెలియని మైనర్ బాలికను చంపుతానని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక మానవ మృగం. బాలిక గర్భవతి కావడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నిడమనూరు మండలం ధన్ సింగ్తండాకు చెందిన రమావత్ చందర్, జ్యోతి దంపతులకు ఓ కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు శాఖాపురం గ్రామంలో మూడేళ్లుగా చేకూరి హనుమంతరావు అనే రైతు వద్ద జీతం ఉంటు వారి ఆవరణలో నివాసం ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఏర్పుల రమేష్ చందర్ అనే వ్యక్తి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారి ఇంటికి వచ్చి చందర్ కూతురిని చంపుతానని బెదిరించి తన ఇంటికి తీసుకువెళ్లి ఆరునెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే కొద్ది రోజులుగా బాలిక నీరసంగా ఉండి కడుపు నొప్పితో బాధపడుతుండటంతో సోమవారం తల్లి జ్యోతి నిడమనూరులో ఒక ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యుడు గర్బవతి అని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ వీరరాఘవులు వెల్లడించారు.

Next Story

Most Viewed