ఆమె ఆందోళన వెనక తీరని విషాదం..!

by  |
ఆమె ఆందోళన వెనక తీరని విషాదం..!
X

దిశ, మహబూబాబాద్: ప్రేమపేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడి ఇంటి ఎదుట బాధితురాలు ఆందోళనకు దిగింది. ఈ ఘటన సోమవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేటలో వెలుగులోకి వచ్చింది.బాధితుల కథనం ప్రకారం.. నర్సింహుల పేట కౌసల్యదేవిపల్లికి చెందిన వేల్పుల శారద బీఈడీ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే గుండరాజుపల్లికి చెందిన మాంకాలి నరేష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడగా.. అది కాస్త ప్రేమకు దారితీసింది.

ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇరువర్గీయుల కుటుంబీకులు పెళ్లికి అంగీకరించారు. ఈ క్రమంలో నిశ్చితార్థం కూడా చేశారు. ఇదే అదునుగా భావించిన మహేష్ ఆ యువతిని శారీరకంగా కలవడంతో గర్భం దాల్చింది. ఎవరికీ అనుమానం రాకుండా యువతికి అబార్షన్ చేయించాడు.
ఇదిలాఉండగా యువతి కుటుంబ సభ్యులు పెళ్లి మాటెత్తె సరికి దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మహేష్ ఇంటికి చేరుకుని ధర్నాకు దిగారు. పెళ్లి చేసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను ఠాణాకు తరలించి విచారిస్తున్నారు.

Next Story

Most Viewed