గిప్ట్ ఏ స్మైల్‌ పేదల జీవితాల్లో వెలుగు నింపుతోంది

by  |
గిప్ట్ ఏ స్మైల్‌ పేదల జీవితాల్లో వెలుగు నింపుతోంది
X

దిశ, న్యూస్‌బ్యూరో: గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగు నింపుతోందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపునకు స్పందించి పార్టీ నేతలు దాదాపు వంద అంబులెన్సులను ఇచ్చేందుకు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ని కలిసి గిప్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఎమ్మెల్సీ శంభీపూర్ ఒక అంబులెన్స్‌ను ప్రభుత్వానికి సమకూర్చేందుకు సంబంధించిన మొత్తాన్ని చెక్ రూపంలో ఇచ్చారు. కేటీఆర్ తన పుట్టిన రోజున స్వయంగా ఆరు అంబులెన్సులను సొంత నిధులతో ప్రభుత్వానికి సమకూర్చేందుకు ముందుకొచ్చిన నేపథ్యంలో తాను కూడా ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.

Next Story

Most Viewed