సోషల్​ మీడియాను ఉపయోగించుకోండి

by  |
GHMC social media
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుత సమయంలో సోషల్​ మీడియా ఫ్లాట్​ఫారాలను సమర్థవంతంగా ఉపయోగించుకొని ప్రజల సమస్యల పరిష్కరించాలని జీహెచ్ఎంసీకి ఎంఏయూడీ సూచింది. రాష్ట్రంలో విధించిన పది రోజుల లాక్​డౌన్ కాలంలో అమలు చేయాల్సిన నిబంధనలపై మున్సిపల్ శాఖ బుధవారం మార్గ నిర్ధేశకాలు జారీ చేసింది. ఈ నెల 12 ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 6 గంటల వరకూ లాక్ డౌన్ అమల్లో ఉండనున్న నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు చేపట్టాల్సిన చర్యలపై ఆయా విభాగాధిపతులకు సూచనలు ఇచ్చింది.

కొవిడ్​ విధుల్లో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది పూర్తి స్థాయిలో హాజరయ్యేలా చూడాలని ఆదేశాల్లో ఎంఏయూడీ పేర్కొంది. మిగిలిన సిబ్బందిని 33% చొప్పున విధులు నిర్వహించాలని సూచించింది. అన్ని ఆఫీసుల ఎంట్రన్స్ ల వద్ద శానిటైజర్లు, హ్యాండ్​వాష్​లో అందుబాటులో ఉంచాలని సూచించింది. కార్యాలయాల్లోనూ, పరిసరాల్లోనూ భౌతిక దూరం అమలు చేయడంతో పాటు అత్యవసరంగా పూర్తి కావాల్సిన పనులకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని పేర్కొంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని స్విమ్మింగ్​ ఫూల్స్, జిమ్స్, సినిమా హాల్స్, క్లబ్స్, పార్కులు పూర్తిగా మూసివేయనున్నారు.


Next Story

Most Viewed