జీహెచ్ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఖరారు?అభ్యర్ధులు ఎవరంటే

by  |
జీహెచ్ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఖరారు?అభ్యర్ధులు ఎవరంటే
X

దిశ,వెబ్‌డెస్క్: బల్దియా బాద్‌షా ఎవరనేది టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి మేయర్ గా , డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌ గద్వాల విజయలక్ష్మి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మోతె శ్రీలత శోభన్‌రెడ్డి తార్నాక కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఇక అభ్యర్ధుల ఖరారు ఫైనల్ అయితే గురువారం మధ్యాహ్నం 12:30 నిమిషాలకు కొత్త నగరానికి కొత్త మేయర్‌ ఎన్నిక కానున్నారు.

Next Story

Most Viewed