ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులకూ మినహాయింపు !

by  |

దిశ, న్యూస్ బ్యూరో :

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులకు కూడా మినహాయింపునిస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. లాక్‌డౌన్ విధించడంతో అన్ని రకాల లోన్లపై ఆర్బీఐ మారిటోరియం విధించి సామాన్యులకు ఊరట కలిగించిన విషయం తెలిసిందే. బల్దియా పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులకు కూడా 2019-2020 ఆర్థిక సంవత్సరానికి మూడు నెలల పాటు అంటే జూన్ 30 వరకు మినహాయింపునిచ్చారు. ఈ బకాయిలకు సంబంధించి ఎలాంటి అదనపు చార్జీలు కూడా విధించడం లేదు.

Tags: Lock down, property tax, GHMC, RBI, Loans



Next Story

Most Viewed