రూ.5,600 కోట్లతో జీహెచ్ఎంసీ బడ్జెట్

by  |
రూ.5,600 కోట్లతో జీహెచ్ఎంసీ బడ్జెట్
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 2021-22 ఆర్థిక సంవత్సర ముసాయిదా బడ్జెట్ ప్రతిపాదనతో పాటు 14అంశాల‌తో కూడిన ఎజెండాను ఆమోదించారు. వివరాలు ఈవిధంగా ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,600 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా, ఈ అంచనా బడ్జెట్‌లో అత్యధికంగా 32శాతం ఆస్తిపన్ను ద్వారా రూ. 1850 కోట్లు వస్తుందని అంచనా. 22శాతం నిధులు రూ. 1224.51కోట్లు రుణాల ద్వారా రానున్నాయి. 17శాతం నిధులు రూ. 1022.70 కోట్లు ఫీజులు, యూజర్ చార్జీల కింద రానుండగా 14 శాతం నిధులు రూ. 770.51 కోట్లు ప్లాన్ గ్రాంట్ల కింద, 13శాతం నిధులు రూ. 652.10 కోట్లు అసైండ్ రెవెన్యూ కింద, 3శాతం నిధులు రూ.189.69 కోట్లు క్రమబద్దీకరణ ఫీజుల కింద లభించనున్నాయి. ఒక శాతం నిధులు రూ.66.20 కోట్లు ఇతర రెవెన్యూ మార్గాల ద్వారా లభించనున్నాయి. రూ. 22.84 కోట్లు కాంట్రిబూషన్ ద్వారా లభించనున్నాయి.

Next Story

Most Viewed