చేనేతలకు బాసటగా ఘట్కేసర్ ఎంపీపీ

by  |
చేనేతలకు బాసటగా ఘట్కేసర్ ఎంపీపీ
X

దిశ, మేడ్చల్: చేనేత కార్మికులకు బాసటగా నిలిచారు ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి. పోచంపల్లి మండలం ముక్తపూర్‌లో చేనేత కార్మికులు తయారు చేసిన చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. సుమారు రూ.2.50 లక్షల విలువ చేసే చేనేత వస్త్రాలను కొనుగోలు చేసినట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలంలో ఉన్న ప్రజా ప్రతినిధులతో కలిసి చేనేత వస్త్రాలను నేస్తున్న కార్మికుల వద్దకు ఆదివారం సుదర్శన్ రెడ్డి స్వయంగా వెళ్లారు. తన వెంట వచ్చిన ప్రజా ప్రతినిధులతో లక్ష రూపాయల విలువైన చేనేత వస్త్రాలనూ కొనుగోలు చేయించారు.


Next Story

Most Viewed