దేవిశ్రీ ‘మెలోడీ’లు వచ్చేస్తున్నాయ్

by  |
దేవిశ్రీ ‘మెలోడీ’లు వచ్చేస్తున్నాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ కారణంగా.. చిత్ర పరిశ్రమలో సందడి లేకుండా పోయింది. ప్రభుత్వ సడలింపులతో ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్స్ మొదలయ్యాయి. దీంతో మూవీ మేకర్స్ తమ సినిమా పనుల్లో వేగం పెంచారు. కొత్త కొత్త అప్‌డేట్స్‌తో సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే.. నవంబర్‌లో వీనుల విందైన ట్రీట్ ఇస్తానని ప్రకటించాడు రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్.

‘నవంబర్ మీ అందరికీ గొప్పగా ఉంటుంది’ అంటూ మ్యూజికల్‌ ఫ్యాన్స్‌కు దేవీ శ్రీ ప్రసాద్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు లాక్‌డౌన్లతో అలసిపోయిన మీరు.. మ్యూజికల్‌ మెలోడీస్‌ కోసం రెడీగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఉప్పెన చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు సూపర్ సక్సెస్ సాధించాయి. ఇక నితిన్ హీరోగా వస్తున్న ‘రంగ్ దే’ పాటలు కూడా ఈ నవంబర్‌లోనే మన ముందుకు రాబోతున్నాయి. ఇదే విషయాన్ని తెలుపుతూ ‘ట్యూన్డ్ ఫర్ ఉప్పెన, రంగ్ దే’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు డీఎస్పీ.

మరి డీఎస్పీ ఊపు, కాన్ఫిడెంట్ చూస్తుంటే.. ఈ రెండు చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ గుడ్ న్యూస్‌తో.. మ్యూజిక్ లవర్స్‌తో పాటు డీఎస్పీ ఫ్యాన్స్ కూడా ఆ పాటల విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



Next Story

Most Viewed