నడి రోడ్డుపైనే జనరేటర్​

by  |
నడి రోడ్డుపైనే జనరేటర్​
X

దిశ, న్యూస్​బ్యూరో: జీహెచ్​ఎంసీ పరిధిలో ఆక్రమణలను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. అందుకు సంబంధించి ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకునేందుకు ఎన్​ఫోర్స్​మెంట్​ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అయితే నేరుగా ఈవీడీఎం డైరక్టర్​కే ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్​ జర్నలిస్ట్​ కాలనీ రోడ్​ నెంబర్​ 70లో ప్రైవేటు వ్యక్తులు జనరేటర్​ ఏర్పాటు చేశారు. రోడ్డును ఆక్రమించి ఉండటంతో స్థానికులకు ఇబ్బందులు వస్తున్నాయని నేరుగా ఈవీడీఎం డైరక్టర్​కు పలువురు ఫిర్యాదు చేశారు. రోజులు గడుస్తున్నా సమస్యను పరిష్కరించలేదు. విభాగాధిపతికే ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా సమస్యపై చర్యలు తీసుకోవడం లేదని, ఇక సాధారణ ప్రజల నుంచి కంప్లయింట్స్​ మీద ఏం చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జీహెచ్​ఎంసీ అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని వారు కోరుతున్నారు.

Next Story

Most Viewed