నిజాయతీగా కష్టపడితే పదవులు అవే వస్తాయి- సజ్జల రామకృష్ణారెడ్డి

by  |
sajjala comments
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ కుటుంబం వంటిదని, పార్టీ కార్యకర్తలు నిబద్ధతో పనిచేస్తున్నారని కొనియాడారు. నిజాయతీగా కష్టపడితే పదవులు వెతుక్కుంటూ వస్తాయని సీఎం జగన్ నిరూపించారని చెప్పుకొచ్చారు. ప్రజలతో మమేకం అవుతూ, ప్రజల కోసం పనిచేసే వారికి నాయకత్వ లక్షణాలు వాటికవే వస్తాయని అభిప్రాయపడ్డారు. అయితే పదవులు కొందరికి ముందుగా వస్తాయని, మరికొందరికి తర్వాత వస్తాయని స్పష్టం చేశారు. అంతమాత్రాన పదవులు రానివారు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో సమాన గౌరవం ఉంటుందని ప్రధాన కార్యదర్శి సజ్జల స్పష్టం చేశారు.

Next Story

Most Viewed