- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హీరోయిన్ జెనీలియా తన పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్తుంటుంది. వారి భవిష్యత్ ఎలా ఉంటుందనే భావనతో అప్పుడప్పుడు భయం కూడా వేస్తుందని చెప్తోన్న జెనీలియా.. పిల్లలకు ప్రకృతిని, పశువులను పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది.
లాక్డౌన్లో ముంబైకి దూరంగా సొంత గ్రామంలోనే గడుపుతున్నామని చెప్పిన జెనీలియా.. లాక్డౌన్ ఎత్తేయడంతో పిల్లల్ని పొలాలకు తీసుకెళ్లే అవకాశం వచ్చిందని తెలిపింది. ఇక్కడ కొత్త క్లాస్ రూమ్ కూడా దొరికిందంటూ.. ఒక పురాతన చింత చెట్టు కింద తన పిల్లలను చదివిస్తున్న వీడియోను షేర్ చేసింది. ‘ప్రకృతి ఒడిలో చదువుకునే అదృష్టం తన పిల్లలకు దొరికినందుకు సంతృప్తిగా ఉంది. అంతేకాదు తన కొడుకులు ఇప్పుడు పర్యావరణం, పశువులను ప్రేమగా చూస్తున్నారు.. అందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు చెప్పినట్లు భూమిని మన పూర్వీకుల నుంచి వారసత్వంగా తీసుకోలేదు.. పిల్లల గురించి అప్పుగా తీసుకున్నాం అంతే’ అంటోంది.