త్వరలో "ఏ మాయ చేసావే" సీక్వెల్ : గౌతమ్ మీనన్

by  |
త్వరలో ఏ మాయ చేసావే  సీక్వెల్ : గౌతమ్ మీనన్
X

“విన్నైతాండి వరువాయ” .. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ చిత్రం తెలుగులో “ఏ మాయ చేశావే” పేరుతో రీమేక్ అయింది. తెలుగులో సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా తమిళ్ లో ఇండస్ట్రీని షేక్ చేసింది. శింబు, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరంతా కొన్ని ఏళ్లుగా ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా అభిమానులకు స్వీట్ న్యూస్ అందించాడు డైరెక్టర్. ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో మాట్లాడిన ఆయన..శింబుకు ఒకే అయితే సీక్వెల్ చేసేందుకు రెడీగా ఉన్నానని స్పష్టం చేశాడు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్తుందని చెప్పాడు. కాగా ఈ సినిమా రీమేక్ చేయాలంటే ఏ మాయ చేసావే మించిన స్క్రిప్ట్ కు కావాలని.. అందుకోసం చాలా కష్టపడుతున్నాను అని చెప్పాడు గౌతమ్ మీనన్. ఈ క్రమంలో చాలా ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. తప్పకుండా సీక్వెల్ తెరకెక్కిస్తాను అని ప్రామిస్ చేసిన గౌతమ్ మీనన్.. ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా కథ తయారు చేస్తానని చెప్పారు.

కాగా గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో శింబు, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ “కార్తీక్ డయల్ సేయ్తా ఎన్” అలరించగా.. ఈ క్రమంలో సీక్వెల్ పై ప్రకటన చేశారు గౌతమ్. అయితే హీరో శింబు ఓకే.. మారి హీరోయిన్ త్రిష నేనా? లేక మరెవరైనా అనేది కోలీవుడ్ లో జరుగుతున్న చర్చ.



Next Story

Most Viewed