- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఇటీవల ఆసియాలోనే రెండో అత్యధిక సంపన్నుడిగా ఎదిగిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన స్థానాన్ని చేజార్చుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో గౌతమ్ అదానీ సంపద భారీగా తగ్గిపోవడంతో ఆయన స్థానంలో చైనాకు చెందిన సంపన్నుడు జాంగ్ షంషాన్ ఆసియా రెండో అత్యంత సంపన్నుడిగా ఎదిగారని గ్లోబల్ ఇండెక్స్ తాజా జాబితా స్పష్టం చేసింది. ఇటీవల అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులు కలిగిన మూడు విదేశీ కంపెనీలకు చెందిన ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయనే వార్తలతో అదానీ సంపద ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అదానీ సంపద ఏకంగా రూ. 55 వేల కోట్లకు పైగా పడిపోయింది. దీంతో ఆయన రెండో స్థానం నుంచి దిగజారారని గ్లోబల్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఆసియా అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
Next Story