సంపన్నుల జాబితాలో స్థానం చేజార్చుకున్న అదానీ

by  |
సంపన్నుల జాబితాలో స్థానం చేజార్చుకున్న అదానీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఆసియాలోనే రెండో అత్యధిక సంపన్నుడిగా ఎదిగిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన స్థానాన్ని చేజార్చుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో గౌతమ్ అదానీ సంపద భారీగా తగ్గిపోవడంతో ఆయన స్థానంలో చైనాకు చెందిన సంపన్నుడు జాంగ్ షంషాన్ ఆసియా రెండో అత్యంత సంపన్నుడిగా ఎదిగారని గ్లోబల్ ఇండెక్స్ తాజా జాబితా స్పష్టం చేసింది. ఇటీవల అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులు కలిగిన మూడు విదేశీ కంపెనీలకు చెందిన ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయనే వార్తలతో అదానీ సంపద ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అదానీ సంపద ఏకంగా రూ. 55 వేల కోట్లకు పైగా పడిపోయింది. దీంతో ఆయన రెండో స్థానం నుంచి దిగజారారని గ్లోబల్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఆసియా అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed