- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో : కాకినాడ శివారులోని టైకీ కెమికల్ పరిశ్రమలో బాయిలర్ పేలింది. దాని నుంచి వెలువడిన గ్యాస్తో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుడిపూడి శ్రీనివాస్ రావు, నమ్మి సింహాద్రిరావు, కలగ సత్య సాయిబాబా, రేగళ్లి రాజ్ కుమార్ను కాకినాడ సూర్య గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి మంత్రి కురసాల కన్నబాబుతోపాటు కలెక్టర్, ఎస్పీ చేరుకున్నారు. ఘటనపై వివరాలు సేకరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మృతి చెందిన కాకర్ల సుబ్రమణ్యం (31), తోటకూర వెంకట రమణ (37) కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story