ఐపీఎల్‌పై గంగూలీ క్లారిటీ

by  |
ఐపీఎల్‌పై గంగూలీ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్-21పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు. మిగిలిన మ్యాచ్‌లను ఇండియాలోనే నిర్వహించే అవకాశం లేదన్నారు. ఐపీఎల్‌ మిగతా మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేందుకు చాలా దేశాల బోర్డులు బీసీసీఐని సంప్రదిస్తున్నాయని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇప్పటికే శ్రీలంక, యూఏఈ, వార్విక్ షైర్, సర్రే, మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్‌లు ఐపీఎల్‌కు అతిథ్యమిచ్చేందుకు ముందుకొచ్చాయని గంగూలీ తెలిపారు. ఐపీఎల్-21 తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.

Next Story

Most Viewed