- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: కరోనా, లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్రం కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వమే సాయం చేసిందని ఆయన చెప్పారు. కరీంనగర్ జిల్లా చర్లబుత్కూరులో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కోటి 91 లక్షల మందికి మాత్రమే బియ్యం సరఫరా చేస్తోందన్నారు. కానీ, టీఆర్ఎస్ సర్కార్ దానికి అదనంగా మరో 88 లక్షల మందికి అందిస్తోందని.. మొత్తం 2 కోట్ల 79 లక్షల మందికి ఇస్తున్నామన్నారు. తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కొరికి 10 కిలోల చొప్పున 5 నెలల పాటు బియ్యం అందిస్తామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
Next Story