నన్ను కాల్చొద్దు.. వారంటే నాకు భయం..!

by  |
నన్ను కాల్చొద్దు.. వారంటే నాకు భయం..!
X

దిశ,వెబ్‌డెస్క్ : యూపీలో యోగి సర్కారు అధికారంలోకి వచ్చాక గ్యాంగ్ స్టర్స్‌కు భయం పట్టుకుంది. ఒక్కొక్కరిగా అందరినీ ఎరివేయడంలో సీఎం యోగి తన మాట నిలబెట్టుకున్నారని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. చాలా మేరకు క్రైంను కంట్రోల్ చేయడంలో సీఎం యోగి మార్క్ ఉందని, యూపీ పోలీసులకు విశేషాధికారాలు ఇవ్వడం వల్లే అది సాధ్యమైందని తెలుస్తోంది. దీంతో ఘోరమైన నేర చరిత్ర ఉన్న గ్యాంగ్ స్టర్స్ పోలీసులకు స్వచ్చందంగా లొంగిపోవడం లేదా ఎన్ కౌంటర్‌లో హతమవడం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే భయంకరమైన నేర చరిత్ర కలిగిన ఓ వ్యక్తి పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే తాను కనిపిస్తే పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారనే అనుమానం అతన్ని కలచివేసింది. అందుకు ఓ ఉపాయం పన్నాడు. ‘నన్ను కాల్చవద్దు..’ అని రాసి ఉన్న ఓ అట్టముక్కను మెడలో ధరించి మరీ.. పోలీసుల ముందుకు వెళ్లాడు.అతని పేరు నయీమ్‌.

ఈ వ్యక్తి ఉత్తర్‌ ప్రదేశ్‌ సంభాల్‌ ప్రాంతంలోని నక్షాసా పోలీస్‌‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం సాయంత్రం లొంగిపోయాడు. ‘నాకు సంభాల్‌ పోలీసులంటే భయం. నేను నా తప్పులను ఒప్పుకుని, లొంగిపోవడానికి వచ్చాను. దయచేసి నన్ను కాల్చకండి’ అని రాసి ఉన్న అట్ట ముక్కను ధరించి పీఎస్‌లోకి అడుగుపెట్టాడు. నయీమ్‌ వివిధ నేరాల్లో నిందితుడిని ఉండగా.. అతడిని పట్టిస్తే రూ.15,000 బహుమతి కూడా ఇస్తామని ప్రకటించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed